మహాభారతం పార్ట్ 5
ఇక్కడ హస్తినాపురంలో 16 ఏళ్ల వయసున్న దుర్యోధనుడు అఫీషియల్ గా రాజు కాకపోయినా త్వరలో నేనే రాజు నవుతాను అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాడు. అప్పట్లో పాండురాజు సన్యాసం తీసుకుంటానని వర్తమానం పంపినప్పుడే ఇక హస్తినాపురానికి నేను నా కుమారులు రాజులమని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. దుర్యోధనుడు ఇక నేనే రాజుని అని అనుకుంటున్న సమయంలో బయట ఏవో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి ఇంత గోల అని దుర్యోధనుడు బయటికి వచ్చి చూస్తే ఎటు చూసిన జనాలు గోల గోల గా అరుస్తున్నారు. బాధతో కాదు ఆనందంతో అరుస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు.
హస్తిపురానికి మరల పూర్వవైభవం రాబోతుందని ఆనందంతో అరుస్తున్నారు. ఎందుకిలా అరుస్తున్నారు అని చూస్తే దూరంగా నార చీరలు కట్టుకున్న ఒక స్త్రీ ఆమె వెనకాల ఎంతో తేజోవంతమైన, ప్రకాశవంతంగా, ఎంతో అందంగా ఐదుగురు కనిపిస్తున్నారు. వారు ఎవరో కాదు కుంతీ, పంచ పాండవులు. ఒక్కసారిగా దుర్యోధనుడి గుండే పిండేసింది, కాళ్లు వణకడం వణకడం మొదలైంది. తనకు తెలియకుండా తన వళ్ళు అంతా చెమట పట్టింది. నుదుటి నుండి చెమట కారుతోంది. ఊపిరి బిగబట్టినట్లయ్యింది. ఇప్పటివరకు నేనే రాజుని అనుకుంటున్నా కానీ వాళ్ళని చూస్తే సింహాసనానికి పోటీగా వచ్చేలా కనిపిస్తున్నారు. బాధతో, భయంతో, ఆవేశంతో వెనకాల ఉన్న కుర్చీ లో కూచున్నాడు.
ఇక్కడ హస్తినాపురంలో 16 ఏళ్ల వయసున్న దుర్యోధనుడు అఫీషియల్ గా రాజు కాకపోయినా త్వరలో నేనే రాజు నవుతాను అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాడు. అప్పట్లో పాండురాజు సన్యాసం తీసుకుంటానని వర్తమానం పంపినప్పుడే ఇక హస్తినాపురానికి నేను నా కుమారులు రాజులమని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. దుర్యోధనుడు ఇక నేనే రాజుని అని అనుకుంటున్న సమయంలో బయట ఏవో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి ఇంత గోల అని దుర్యోధనుడు బయటికి వచ్చి చూస్తే ఎటు చూసిన జనాలు గోల గోల గా అరుస్తున్నారు. బాధతో కాదు ఆనందంతో అరుస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు.
హస్తిపురానికి మరల పూర్వవైభవం రాబోతుందని ఆనందంతో అరుస్తున్నారు. ఎందుకిలా అరుస్తున్నారు అని చూస్తే దూరంగా నార చీరలు కట్టుకున్న ఒక స్త్రీ ఆమె వెనకాల ఎంతో తేజోవంతమైన, ప్రకాశవంతంగా, ఎంతో అందంగా ఐదుగురు కనిపిస్తున్నారు. వారు ఎవరో కాదు కుంతీ, పంచ పాండవులు. ఒక్కసారిగా దుర్యోధనుడి గుండే పిండేసింది, కాళ్లు వణకడం వణకడం మొదలైంది. తనకు తెలియకుండా తన వళ్ళు అంతా చెమట పట్టింది. నుదుటి నుండి చెమట కారుతోంది. ఊపిరి బిగబట్టినట్లయ్యింది. ఇప్పటివరకు నేనే రాజుని అనుకుంటున్నా కానీ వాళ్ళని చూస్తే సింహాసనానికి పోటీగా వచ్చేలా కనిపిస్తున్నారు. బాధతో, భయంతో, ఆవేశంతో వెనకాల ఉన్న కుర్చీ లో కూచున్నాడు.
పాండవులని చూసి ప్రజలు ఎందుకు అంత సంతోషంగా ఫీల్ అయ్యారు అంటే పూర్వం పాండురాజుకి పెళ్లి అవకముందు ధృతరాష్ట్రుడు రాజయినప్పటికీ వెనకుండి ఒంటిచేత్తో సమర్థవంతంగా రాజ్యాన్ని నడిపించింది మాత్రం పాండురాజే. పాండురాజు ఉన్నంతకాలం హస్తినాపురంలో ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మరలా పాండురాజు పిల్లలు రాజు అవుతారని వారు ఆనందం వ్యక్తం చేశారు. కోట గుమ్మం దగ్గర భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, ఆయన తమ్ముళ్లు అందరు సంతోషంగా వారికి స్వాగతం పలికారు. కానీ దుర్యోధనుడి గుండెల్లో మాత్రం ద్వేషం అనే విత్తనం నాటుకుంది.
కోటలో పాండవులు అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన వంటకాలన్నీ చేయించుకొని తింటున్నారు. ఎప్పుడూ వారి మొహంలో చిరునవ్వు కనిపిస్తూనే ఉంది. దాన్ని దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఎక్కువగా దుర్యోధనుడికి భీముడు పైననే పైననే ద్వేషం కలిగింది. ఎందుకంటే భీముడిని భీష్ముడు ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఎంతో బలంగా, పుష్టిగా, సరదాగా ఉన్న భీముడిని అందరూ ఇష్టపడుతున్నారు. అప్పటివరకు దుర్యోధనుడిని మల్ల యుద్ధం లో ఎవరూ ఓడించలేదు. అందుకని భీముడిని తనతో మల్ల యుద్ధం చేయమని అందరి సమక్షంలో అడిగాడు. అందరూ ఆ ద్వంద యుద్ధం చూడడానికి ఆసక్తిగా వచ్చారు.
ఆ యుద్ధం సరదాకోసం మాత్రమే అని అందరూ అనుకున్నారు, కానీ తన ఆధిపత్యాన్ని చూపించుకోడానికి దుర్యోధనుడు ఏర్పరుచుకున్న అవకాశం మాత్రమే అది. రింగులోకి భీముడు, దుర్యోధనుడు ఇద్దరు వచ్చారు. ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు దుర్యోధనుడు, భీమ ఇప్పటివరకు మల్ల యుద్ధం లో నన్ను ఓడించిన మగాడే లేడు. ఇప్పుడు నిన్ను ఒక్క క్షణంలో నేను ఓడిస్తాను. అనేలోపు భీముడు దుర్యోధునుడి రెండు కాళ్లు పట్టుకొని, రెండు పక్కల కొట్టి గాల్లోకి విసిరేశాడు. వెంటనే దుర్యోధనుడు నోటి నుండి రక్తం కారుతూనే కింద పడ్డాడు. భీముడి బలానికి అందరూ ఆశ్చర్యపోయారు.
భీముడిని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. దుర్యోధనుడు అవమానంతో లేచి ఒక కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నాడు. అందరూ భీముడు దగ్గరికి వెళ్లి భీముడిని మెచ్చుకుంటున్నారు. దుర్యోధనుడు దగ్గరికి ఎవరు రావట్లేదు. అందరూ భీముడి పక్షమేనా... నా దగ్గరికి ఎవరు రారా అని దుర్యోధనుడు అనుకుంటుండగా ఒక చేయి దుర్యోధనుడి భుజాన్ని తాకింది. ఆ చేయి ఎవరిదో కాదు శకునిది. భీష్ముడి కుటుంబాన్ని, రాజ్యన్ని నాశనం చేయాలనుకునే శకునికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అది దుర్యోధనుడు రూపంలోనే.
తన పగ తీరాలంటే కేవలం తెలివితేటలు ఉపయోగించాలని అనుకున్నాడు. ప్రస్తుతం హస్తినాపురం భవిష్యత్తు పాండవులు, కౌరవుల మీదే ఆధారపడి ఉంది. వీరిద్దరి మధ్య గొడవ పెడితే చాలు రాజ్యం ఆటోమేటిక్ గా నాశనం అయిపోతుంది. పాండవులు తెలివైన వారు వారి దగ్గర ఎక్కువ కాలం నా ఆటలు సాగవు. దుర్యోధనుడే నాకు కరెక్ట్ ఛాయిస్. దుర్యోధనుడు కూడా తెలివైనవాడే కానీ ఆవేశపరుడు ఆవేశపరులు కి అవసరమైన సమయంలో తెలివి పనిచేయదు అని శకుని అనుకున్నాడు. శకుని ఎప్పుడు పాండవుల పక్షపాతే. ఎప్పుడూ పాండవులే గెలవాలని అనుకుంటాడు. కానీ దుర్యోధనుడి తోనే నమ్మకంగా ఉంటాడు. అప్పుడే కదా కథ తనకు నచ్చినట్టు జరుగుతుంది.
మహాభారతంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి వారూ కథ మొత్తం నేను అనుకున్నట్టే జరుగుతుంది అని ఎవరికి వారు అనుకుంటారు. కానీ వెనకాల ఉండి కథంతా నడిపించేది కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు మాత్రమే. మహాభారతం మొత్తం కౌరవులు, పాండవుల గురించి ఉంటుంది. శ్రీకృష్ణుడు కేవలం గెస్ట్ మాత్రమే, కానీ కథలోని ట్విస్టులు అన్ని శ్రీకృష్ణుడు క్రియేట్ చేస్తాడు. శకుని దుర్యోధనుని తీసుకొని పక్కకు వెళ్లాడు. అప్పుడు దుర్యోధనుడు మామ వాళ్లని ఏదో ఒకటి చేద్దాం నాకు కోపం తగ్గట్లేదు ఏం చేద్దాం చెప్పు మామ నాన్నకు చెప్పి వాళ్ల మొహంలో నవ్వు లేకుండా చేద్దాం అని అన్నాడు.
అప్పుడు శకుని, దుర్యోధన ముందుగా నువ్వు నేర్చుకోవాల్సింది దేవుడు మనకు మాట ఇచ్చింది మనం అనుకున్నది మాట్లాడడానికి కాదు. మన బ్రెయిన్ లో ఏముందో ఎదుటి వారికి తెలియకుండా దాచి పెట్టడానికి, అందరిని నమ్మించడానికి, అందరితో ప్రేమతో ఉన్నట్టు నటించడానికి, నీ మీద ఎవరికీ అనుమానం కలగకుండా చేసుకోడినికి. మాటే ఆయుధం, సమయం దొరికినప్పుడు అందరిని నువ్వు వశపరుచుకోవాలి అని కమ్మగా నెమ్మదిగా దుర్యోధనుడి మనసులోకి శకుని విషం ఎక్కించాడు. మామ నాకు సాయం చేస్తున్నాడు అని దుర్యోధనుడు అనుకొని సరే మామ నేను నిన్ను నమ్ముతాను ఇకనుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను అని దుర్యోధనుడు శకునితో అన్నాడు.
ఈ కోటలో మన ఆటలు సాగవు, ఏదైనా బయటి నుండే ప్లాన్ చేద్దాం అనుకొని వెంటనే గుర్రం బండ్ల పోటీ పెడదామని పాండవులకి దుర్యోధనుడు ఆహ్వానం పంపించాడు. అందరూ సరే అని గుర్రం బండ్ల పోటీకి రెడీగా ఉన్నారు. పాండవుల, కౌరవుల బండ్లు వరుసగా నిలబడి ఉన్నాయి. గంట మోగింది అందరి గుర్రం బండ్లు ముందుకు కదిలాయి. భీముడి గుర్రం బండి తప్ప అందరి బండ్లు ముందున్నాయి. భీముడి గుర్రం బండి మాత్రం నెమ్మదిగా వెళుతుంది. భీముడి బరువు వల్ల గుర్రాలు వేగంగా పరుగెత్తలేకపోతున్నాయి.
అమ్మో నేనే వెనకాల ఉన్నాన అని భీముడు వెనక్కి తిరిగి చూడగా పక్కన మరో బండి వచ్చింది ఆ బండి ఎవరిదో కాదు అందులో దుర్యోధనుడు శకుని ఉన్నారు. దుర్యోధనుడు భీముడితో ఏంటి మిత్రమా అంత నీరసంగా ఉన్నావు. ఉత్సాహంగా ఉండు నేను చూడు ఎంత ఉత్సాహంగా ఉన్నాను. నేను కామధేనువు పాలతో తయారు చేసిన పాయసం తాగాను. అందుకే నేను ఇంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను. కావాలంటే నువ్వూ దీన్ని తాగు అని తన చేతుల్లో ఉన్న పాయసం గిన్నెను దుర్యోధనుడు భీముడికి ఇచ్చాడు.
ఒక్క గుటకలోనే భీముడు పాయసం మొత్తం తాగేశాడు. రెండు నిమిషాల్లోనే పరిగెడుతున్న గుర్రం బండి నుండి భీముడు సృహతప్పి కిందపడిపోయాడు. దుర్యోధనుడు, శకుని భీముడు దగ్గరికి వచ్చి మామ విషం తొందరగానే పని చేసింది అని అనుకున్నారు. భీముడికి ఎన్నో తాడులు కట్టి ఈడ్చుకుంటూ వెళ్లి పక్కన ఉన్న ఒక మడుగులో పడేశారు. ఆ మడుగులో ఎన్నో విష సర్పాలు ఉన్నాయి. భీముడు కొన ఊపిరితో ఉన్నాడు. విష ప్రభావం వల్ల కొన్ని క్షణాల్లో చనిపోతాడు. మడుగులో ఉన్న సర్పాలు భీముడిని కసిగా కాటు మీద కాటు వేస్తూనే ఉన్నాయి. భీముడు శరీరమంతా దుర్యోధనుడు ఇచ్చిన విషం మరియు విష సర్పాల విషంతో నిండిపోయి మరికొద్ది సేపట్లో చనిపోవాల్సిన భీముడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు.
తన చుట్టూ కట్టి ఉన్న తాళ్ళన్నీ తెంపేసాడు. తన చుట్టూ ఉన్న పాములను ఒక్కొక్క దాన్ని పట్టుకొని దారం తెంపినట్టుగా రెండుగా తెంపుతూ పాములను చంపేస్తున్నాడు. అప్పుడు భయంతో పాములన్నీ భీముడికి దూరంగా వెళ్తున్నాయి. పాముల వెనక నీటిలో వెళ్తుండగా భీముడికి ఒక ద్వారం కనిపించింది. దాంట్లోకి వెళ్లి చూడగా అక్కడ ఒక గొప్ప అద్భుతమైన, అందమైన ప్రదేశం కనిపించింది అదే నాగ లోకం. అక్కడ వాసుకి అనే పాముల అధిపతి కనిపించాడు. భీముడిని చూడంగానే వాసుకికి అంత అర్థం అయిపోయింది. ఎవరో నీకు విషం ఎక్కించారు పాములు కాటు వేయడం ద్వారా పాముల విషం నీ ఒంట్లో ఉన్న విషానికి విరుగుడుగా పనిచేసింది.
విషానికి విరుగుడు విషమే అంటారు కదా అదే జరిగింది. అందుకే నువ్వు ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నావు. అసలు ఎవరు నువ్వు అని వాసుకి అడిగాడు. నేను పాండురాజు, కుంతి కుమారుడు భీముడుని అని చెప్పాడు. నువ్వు మా కుంతి కుమారుడవ... కుంతికి నాకు తీర్చలేని రుణం ఉంది వరుసకి నువ్వు నాకు మనువడివి అవుతావు. ఇదిగో ఈ ద్రవాన్ని తాగు దేవలోకంలో అమృతం ఎలాగో మాకు నాగలోకంలో ఇదే అమృతం ఇది నువ్వు తాగితే నీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అని చెప్పి భీముడితో ఆ ద్రవాన్ని తాగించాడు.
ఒక్కసారిగా భీముడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది, అపారమైన శక్తి వంతుడు అయ్యాడు. ఇక మీ లోకానికి వెళ్ళు అని భీముడిని వాసుకి సాగనంపాడు. ఇంతలో ఇక్కడ గుర్రం పందెం అయిపోయింది. పందెంలో అర్జునుడు గెలిచాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. అర్జునుడు మాత్రం భీముడు ఎక్కడ అని చూస్తే ఎక్కడ కనిపించకపోయేసరికి భీముడిని వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళాడు. అదే దారిలో వెళ్తున్నప్పుడు అర్జునుడికి దుర్యోధనుడు ఎదురయ్యాడు. దుర్యోధన మా భీముడు కనిపించాడా అని అడిగాడు. లేదే ఉదయం నుంచి భీముడు నాకు కనిపించలేదు అని దుర్యోధనుడు అన్నాడు. కానీ దుర్యోధనుడి మాటల్లో తడబాటు, పక్కన ఉన్న శకుని కన్నింగ్ చూపు చూశాక వీల్లే భీముడిని ఏదో చేసి ఉంటారు అని అర్జునుడికి అనుమానం వచ్చి వెనక్కి వేగంగా వెళ్లాడు.
కొంతదూరం వెళ్లాక ఒక చోట భీముడి రథం కనిపించింది. కాని దాని మీద బీముడు లేడు. ఇంకా ముందుకు వెళ్ళాడు సడన్ గా ఒక చోట ఆగి ఇక్కడే భీముడికి ఏదో జరిగింది అని అర్జునుడు అనుకున్నాడు. అక్కడే భీముడికి ఏదో జరిగిందని అర్జునుడు అనుకోవడానికి కారణం ఏమిటంటే భీముడు యొక్క రథచక్రాల గుర్తులు భీముడి బరువు వల్ల అక్కడి వరకే లోతుగా ఉన్నాయి. ఆ తర్వాత రథచక్రాల గుర్తులు రథచక్రాల గుర్తులు లోతు తగ్గింది. అంటే ఈ ప్రదేశంలోనే భీముడు రథము నుంచి కిందికి దిగాడు అని నిర్దారించుకొని ఆ చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టాడు.
భీముడిని మడుగులో పడేయడానికి ఈడ్చుకెళ్లిన గుర్తులని అనుసరిస్తూ అర్జునుడు వెళ్ళాడు అర్జునుడికి కథంతా అర్థమయింది. భీముడిని ఏదో చేసి వీల్లే ఈ మడుగులో పడేసారు అని అనుకొని అర్జునుడు ఆ మడుగు ప్రక్కన కూర్చొని బాధపడుతుంటే ఎదురుగా నీళ్లలో నుండి భీముడు పైకి వచ్చాడు వెంటనే అర్జునుడు ఆనందంతో వెళ్లి భీముడిని కౌగిలించుకున్నాడు.
జరిగిందంతా భీముడు అర్జునుడికి చెప్పి వెంటనే దుర్యోధనుడి విషయం అందరికీ చెబుదాం అని భీముడు అన్నాడు. అప్పుడు అర్జునుడు బీమా, దుర్యోధనుడు ఇలా చేశాడు అని మనకు తెలుసు అని అతనికి తెలిస్తే ఇకపైన మనల్ని రహస్యంగా దాడి చేయాలనుకోడు, డైరెక్ట్ గానే మనపై మనపై దాడి చేయాలని చూస్తాడు. ఎప్పటివరకైతే ఇది సీక్రెట్ గా ఉంటుందో మనకు తెలియకుండా ఉండడానికి వాడి కుతంత్రాలు కొంచమైన తగ్గిస్తాడు. మనకి తెలియనట్టుగా ఉంటేనే అది మనకి ప్రయోజనం అని అర్జునుడు అన్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పమని అనుకొని ఇద్దరు కోటకి తిరిగి వచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే పాండవులందర్నీ ఒక్కొక్కరికి చంపుదాం అని దుర్యోధనుడు అన్నప్పుడు మొదటగా భీముడిని చంపుదామని శకుని సలహా ఇచ్చాడు. ఎందుకనగా పాండవులు అందరి లో దేన్నైనా తట్టుకొని జీవించే సామర్థ్యం ఉన్న వాడు భీముడే.
అందుచేత వెయ్యి ఏనుగుల బలం ఉన్న భీముడు ఒక్క దెబ్బతో తో కౌరవులను చంపగలడు అనుకొని భీముడి కన్నా తన కుమారుడు దుర్యోధనుడుని బలవంతుడిని చేద్దామని అనుకొని దానికోసం వ్రతం చేద్దామని అనుకొని దుర్యోధనుడుని పిలిచి సరిగ్గా మూడు రోజులకి నువ్వు నా దగ్గరికి నీ ఒంటి మీద బట్టలు లేకుండా ఒక్క నూలుపోగు కూడా లేకుండా పూర్తి నూడ్ గా రా, నా చేతులతో నీ శరీరమంతా తాకుతాను, నేను నీ శరీరంలో ఎక్కడైతే తాకుతానో ఆ ప్రదేశమంతా దృఢంగా, బలంగా మారిపోతుంది. అప్పుడు ఏ ఆయుధం కానీ, బల్లెం కానీ నిప్పు కానీ నీ శరీరాన్ని చీల్చ లేదు అని దుర్యోధనుడితో చెప్పింది. ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది.
ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com