అర్జునుడికి ద్రోణాచార్యుడు ఇచ్చిన మాట

మహాభారతం పార్ట్ 6

మూడు రోజులు గడిచింది వ్రతం పూర్తయింది గాంధారి తన దాసిని పిలిచి దుర్యోధనుడిని పూర్తిగా బట్టలు లేకుండా తన ముందుకి రమ్మని చెప్పు అని చెప్పింది. దుర్యోధనుడు బట్టలు లేకుండా రావడానికి తన బట్టలు విప్పేస్తుంటే ఒక అమ్మాయి నవ్వు వినిపిస్తుంది. ఎవరా అని పక్కకి తిరిగి చూస్తే అక్కడ నవ్వుతుంది దుర్యోధనుడి చెల్లెలు అయిన దుశ్చల. ఇంత పెద్దవాడివి అయ్యావు బట్టలు అన్ని విప్పేస్తున్నావు ఏంటన్నయ్యా అంది. దానితో కొంచెం సిగ్గుతో దుర్యోధనుడు తన అంగ వస్త్రాన్ని(ఇన్నర్ వేర్) మాత్రం విప్పకుండా తన తల్లి గాంధారి ముందుకు వెళతాడు. గాంధారి కళ్లకు ఎప్పుడూ గంతలు కట్టి ఉంటుంది కాబట్టి దుర్యోధనుడు అంగవస్త్రం తో వచ్చినట్టు గాంధారీకి తెలియదు.

దుర్యోధనున్ని తన దగ్గరకి పిలిచి గాంధారీ తన చేతులతో దుర్యోధునుడిని తల నుండి కింది వరకు తాకుతూ వచ్చింది. కిందికి రాగానే గాంధారీ చేతులకు అంగవస్త్రం తగిలింది. అపుడు గాంధారీ ఏంటి దుర్యోధన ఇది, నిన్ను పూర్తిగా బట్టలు లేకుండా రమ్మని చెప్పిన కదా ఇలా ఎందుకు చేశావు అని అడిగింది. అపుడు దుర్యోధనుడు చెల్లి నన్ను అవమానించిందమ్మ అందుకే ఇలా చేశాను అని చెప్తాడు. వెంటనే దుశ్చలను పిలిపించి ఎందుకు ఇలా చేశావు అని అడిగితే, నాకేం తెలియదు అమ్మా నేను ఉదయం నుండీ ఉద్యాన వనంలోనే ఉన్నాను అని దుశ్చల చెప్పింది. అపుడు గాంధారికి అర్థమయింది. దుశ్చల రూపంలో వచ్చి దుర్యోధనుడిని అవమానించింది ఎవరో కాదు శ్రీకృష్ణుడు అని.






అయ్యో నా కుమారుడి శరీరం వజ్రం కన్నా ధృడంగా తయారయ్యింది కానీ ఒక్క తొడలు తప్ప(అంగవస్త్రం ఉన్నందున ఆ భాగాన్ని గాంధారీ చేతులతో తాకడం కుదరలేదు కనుక) అని గాంధారీ బాధ పడసాగింది. ఇలాంటి పరిస్థితే ఒకసారి శ్రీకృష్ణుడికి ఎదురైంది. సత్యభామ కూడా ఇదే వ్రతం చేసి శ్రీకృష్ణుడి శరీరమంతా తాకింది దాంతో శ్రీకృష్ణుడి శరీరం వజ్రం కన్నా ధృడంగా తయారైంది. కానీ సత్యభామ శ్రీకృష్ణుడి అరికాలు తాకడం మరిచిపోయింది. అదే చివరకు శ్రీకృష్ణుడి మరణానికి కారణమైంది. ఒకవేళ గాంధారీ దుర్యోధనుడి శరీరాన్ని అంగంతో సహా తాకి ఉంటే కురుక్షేత్రం యుద్దంలో దుర్యోధనుడిని ఎవరూ ఓడించలేరు. అందుకనే శ్రీకృష్ణుడు ఇలా చేసాడు.

ఇక పాండవులకు, కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పించవలసిన సమయం వచ్చింది అని భీష్ముడు ద్రోణాచార్యుడిని పిలిపించాడు. ద్రోణాచార్యుడు మరియు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ హస్తినాపురానికి వచ్చారు. భీష్ముడు కౌరవులను పిలిచి ఒక్కొక్కరిని ద్రోణాచార్యునికి పరిచయం చేస్తున్నాడు. కౌరవులు ఒక్కొక్కరిగా ద్రోణాచార్యుడికి నమస్కారం చేస్తున్నారు. కానీ వారు చేసే నమస్కారంలో ఒక్కరికి కూడా గౌరవం, భయం, భక్తి ఏమీ లేవు. ఏదో మొక్కుబడికి నమస్తే గురుజీ, నమస్తే ఆచార్య అని చెప్తున్నారు. వీళ్ళకా నేను యుద్ధ విద్యలు నేర్పించేది అని మనసులో ద్రోణాచార్యుడు బాధపడ్డాడు.

తరువాత భీష్ముడు పాండవులను పిలిచి పరిచయం చేసాడు. పాండవులు వచ్చి ద్రోణాచార్యుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. శిశ్యులు అంటే వీళ్ళలా ఉండాలి అని ద్రోణాచార్యుడు మనసులో సంతోషించాడు. మరుసటి రోజు ద్రోణాచార్యుడు కౌరవులను, పాండవులను పిలిపించాడు. వీరందరినీ ఒక చెట్టు చుట్టూ నిల్చోమని చెప్పాడు. అందరూ చెట్టుచుట్టూ నిల్చున్నారు. ద్రోణాచార్యుడు ఆ చెట్టుమీద ఒక కొమ్మకి ఒక పక్షి బొమ్మను ఏర్పాటు చేసాడు. అందరికి విల్లు, బాణాలు ఇవ్వమని అశ్వద్ధామకు చెప్పాడు. అశ్వద్ధామ మొత్తం 105 మందికి విల్లులు, బాణాలు ఇచ్చాడు.

అందరూ మీ బాణాలని ఈ చెట్టుకి ఎక్కుపెట్టి చెట్టుమీద ఉన్న పక్షి బొమ్మకి గురి పెట్టమని చెప్పాడు. అందరూ తమ బాణాలు ఎక్కు పెట్టారు. అంతలో దుర్యోధనుడు బాణం వదలమంటారా ఆచార్య అని అంటాడు. నేను చెప్పేంత వరకు బాణం వదలకండి అని చెప్పి ద్రోణాచార్యుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. నాలుగు గంటల తర్వాత ద్రోణాచార్యుడు వచ్చాడు. వచ్చి చూసే సరికి కౌరవులందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. దుర్యోధనుడు హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. భీముడు ఏకంగా నిద్రపోయాడు. పాండవులు కూడా ఎవరూ నాలుగు గంటల ముందు ఉన్న పొజీషన్ లో ఎవరూ లేరు ఒక్క అర్జునుడు తప్ప.


కేవలం అర్జునుడు మాత్రమే నాలుగు గంటల నుండి బాణం ఎక్కు పెట్టి అదే పొజీషన్ లో అలాగే స్థిరంగా ఉన్నాడు. ద్రోణాచార్యుడు వచ్చి నేను ఏం చెప్పాను మీరు ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచాడు. అందరూ భయపడి లేచి వెళ్లి మళ్లీ చెట్టుకి బాణాలు ఎక్కుపెట్టారు. ద్రోణాచార్యుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నీకు ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కోలాగా సమాధానం చెప్తారు. నాకు ఆకులు కనిపిస్తున్నాయి అని ఒకరు, పండ్లు కనిపిస్తున్నాయి అని ఒకరు, చెట్టు కనిపిస్తుందని ఒకరు చెప్తున్నారు.

చివరిగా అర్జునుడి దగ్గరికి వెళ్లి నీకు ఏం కనిపిస్తుంది అర్జునా అని అడిగాడు. నాకు పక్షి కన్ను కనిపిస్తుంది ఆచార్య అని అర్జునుడు చెప్పాడు. ఇంకేం కనిపిస్తుంది అని అడిగాడు. ఇంకేమి కనిపించట్లేదు అని చెప్పాడు. ఎందుకు కనిపించట్లేదు... చెట్టూ, ఆకులు, పండ్లూ ఉన్నాయి కదా అని ద్రోణాచార్యుడు అన్నాడు. కానీ నేను వాటిని చూడాలనుకోవడం లేదు ఆచార్య కేవలం పక్షి కన్ను మాత్రమే చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు అంటాడు. ద్రోణాచార్యుడు సంతోషించి, ఇంకెందుకు చూస్తున్నావ్ వొదులు బాణం అన్నాడు. అర్జునుడు బాణం వదిలాడు. అర్జునుడు బాణం వదిలిన శబ్ధం వినిపించింది కానీ బాణం ఏమైందో ఎవరికీ కనిపించలేదు. పైకి చూస్తే పక్షి బొమ్మ అక్కడే ఉంది. కానీ దానికి తల లేదు. ఒక్క క్షణం ఆగి ఆ బొమ్మ కింద పడింది.

ఇదీ విల్లుకారుడికి ఉండాల్సిన దమ్ము అని ద్రోణాచార్యుడు సంతోషించి అర్జునుడుని పైకి లేపి ఈ ప్రపంచంలోనే గొప్ప విల్లుకారునిగా నిన్ను తయారు చేస్తానని మాట ఇస్తున్నాను అని ద్రోణాచార్యుడు అర్జునుడితో అంటాడు. ద్రోణాచార్యుడు అర్జునుడికి మాట ఇవ్వడంతో దుర్యోధనుడు అసూయ పడ్డాడు. గురువుగారు కూడా పాండవుల పక్షపాతే అని దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు.

మరుసటి రోజు ద్రోణాచార్యుడు ధర్మరాజును, దుర్యోధనుడిని పిలిచాడు. ఇద్దరినీ ఒకే ప్రశ్న అడిగాడు. మీలో ఎవరు మంచి వారూ అని. అపుడు దుర్యోధనుడు నేనే అందరికన్నా మంచి వాడిని అని చెప్తాడు. ధర్మరాజు మాత్రం నా కన్నా దుర్యోధనుడే మంచివాడు అని చెప్తాడు. ఎందుకు నీకన్నా దుర్యోధనుడే మంచివాడు అంటున్నావని ధర్మరాజుని అడిగితే, నేను ఎప్పుడూ ధర్మం ధర్మం అని ధర్మం పాటించమని చెప్తూ నా తమ్ముళ్లను ఇబ్బంది పెడుతుంటాను. కానీ దుర్యోధనుడు మంచో చెడో తన తమ్మళ్ల ఆనందమే కోరుకుంటాడు అందుకే నా కన్నా దుర్యోధనుడే మంచివాడు అని ధర్మరాజు చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు నేను ధర్మం పాటించమని చెప్పి నా తమ్ముల్లను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ల సంతోషమే కోరుకుంటాను అని అంటాడు.

అపుడు ద్రోణాచార్యుడు దుర్యోధనా, వ్యక్తిత్వం, మనిషి అంటే ధర్మరాజులా ఉండాలి. చూసి సిగ్గుపడు, చూసి నేర్చుకో అని చెప్పి వెళ్లిపోతాడు. దుర్యోధనుడు షాక్ అవుతాడు, ఏమి అర్థం కాదు. గురువుగారు అడిగిన ప్రశ్నకు ఇద్దరం ఒకటే సమాధానం చెప్పాము. ధర్మరాజు కూడా నేనే మంచి వాడిని అని ఒప్పుకున్నాడు. ఇద్దరం ఒకటే సమాధానం చెప్పినపుడు ధర్మరాజును మెచ్చుకొని నన్ను ఎందుకు ఇలా అన్నాడు...ఒహో గురువుగారు కూడా పాండవుల పక్షపాతే కదా అని దుర్యోధనుడు గురువు గారి మీద ద్వేషం పెంచుకోవడం మొదలు పెట్టాడు.

ఒకరోజు ద్రోణాచార్యుడు కౌరవులు, పాండవులు అందర్నీ పిలిచి ప్రతి మనిషికి ఏదో ఒక విద్యలో ప్రతిభ ఉంటుంది. ఈ రోజు మీలో ఎవరికి ఏ విద్యలో ప్రతిభ ఉందో నిర్ణయిస్తాను అని వారితో అన్నాడు. భీముడిని దగ్గరికి పిలిచి భీమా నీకు కత్తి, గొడ్డలి, ఈటె, గద, బాణం ఇస్తే వీటిలో నువ్వు ఏది ఎంచుకుంటావు అని ద్రోణాచార్యుడు అడిగాడు. అపుడు భీముడు ఆచార్య నా చేతికి కత్తి ఇచ్చినా ఒక చీపురు పుల్ల పట్టుకున్నట్టుగానే ఉంటుంది. కాబట్టి నాకు గద ఇవ్వండి కొండనైనా పిండి చేస్తాను అంటాడు. అది చూసిన దుర్యోధనుడు పాండవులలో బలవంతుడు భీముడే. కాబట్టి భీముడిని ఎదుర్కోవలసింది నేనే అనుకొని గురువు గారు నాక్కూడ గదనే ఇవ్వండి అని దుర్యోధనుడు కూడా గద తీసుకున్నాడు.


ధర్మరాజు ఈటెలు వేయడంలో, రథసారథ్యంలో, నకులసహదేవులు కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో ప్రావీణ్యులు అవ్వాలని అనుకున్నారు. చివరిగా ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గరకు వచ్చి యుద్ధరంగంలో అందరికన్నా శక్తివంతుడు ఒక విల్లుకారుడు మాత్రమే. ఎందుకనగా ఏ ఆయుధంతో యుద్ధం చేయాలన్నా కూడా శత్రువు రెండు అడుగుల దూరంలో ఉండాలి. కానీ వంద అడుగుల దూరంలో ఉన్నా కూడా శత్రువుపై బాణం వేసి మట్టుపెట్టవచ్చు. విల్లుకారునికి ఉండాల్సిన ఓర్పు, సహనం, ఏకాగ్రత, దీక్ష నేను నీలోనే చూసాను. బాణానికి మంత్రశక్తి తోడైతే అది అస్త్రం అవుతుంది. ఒక అస్త్రం వదిలితే అది వంద బాగాలుగా ఏర్పడి ఒకేసారి ఎంతో మంది శత్రువులను మట్టుపెడుతుంది.

అటువంటి అస్త్ర విద్య, శస్త్ర విద్య ఇక్కడ నీకు మాత్రమే అబ్బుతుంది. విలువిద్యకు నువ్వే అర్హుడివి నువ్వు అత్యంత వీరుడివి అవుతావు అని ద్రోణాచార్యుడు అర్జునుడితో అనడంతో దుర్యోధనుడికి భయం మొదలైంది.

పాండవులలోని ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులను మా 100 మంది కౌరవులు అడ్డుకోగలరు. కానీ ఒక్క అర్జునుడిని అడ్డుకొనే మగాడు మాత్రం మాలో ఎవరూ లేరూ అని దుర్యోధనుడికి భయం వేసింది. ఏమి చేయాలో అర్థం కావడంలేదు దుర్యోధనుడికి. తరువాత రోజు ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో గుర్రపు స్వారీ ఎలా చేయాలో మెళకువలు నేర్పించడానికి కౌరవులు, పాండవులను అడవికి తీసుకెళ్లాడు. అడవిలో అందరి గుర్రాలు ఒకే దిశగా పరిగెడుతున్నాయి. ద్రోణాచార్యుడి గుర్రం, అర్జునుడి గుర్రం పక్కపక్కనే పరుగెడుతున్నాయి. ఇంతలో గుర్రాల డెక్కల శబ్ధానికి భయపడుతూ వారి పక్కనుంచి ఒక అడవి పంది పెద్దగా అరుస్తూ పరుగెడుతుంది.

అపుడు అర్జునా బాణం తియ్ అని ద్రోణాచార్యుడు అన్నాడు. ఇంతవరకు నువ్వు నిలకడగా ఉన్న వాటి పై బాణం వేసావు. ఇపుడు కదులుతున్న వాటి పై బాణం వేయడంలో ప్రావీణ్యుడివి అవ్వాలి, నీ కుడి వైపున పరుగెడుతున్న అడవిపంది పై బాణం వెయ్ అని ద్రోణాచార్యుడు అర్జునుడితో అన్నాడు. వెంటనే అర్జునుడు బాణం తీసి పరుగెడుతున్న ఆ పందికి గురి పెట్టాడు. వెంటనే ఒక్క క్షణంలో సబ్ సబ్ సబ్ మని మూడు బాణాలు వచ్చి పందికి ఎటువంటి గాయం కాకుండానే, పంది అరవడానికి వీల్లేకుండా నోటికి అడ్డంగా పల్ల మధ్యలో పడ్డాయి. అంత అద్భుతంగా బాణాలు వేయడం చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ ఆ బాణాలు వేసింది అర్జునుడు కాదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు.

ఆ బాణాలు వేసింది ఎవరో తెలుసుకోవాలని వెంటనే అందరూ గుర్రాలు దిగి ఆ బాణాలు వచ్చిన దిశగా వెతకసాగారు. కొంత దూరం వెళ్లాక కండలు తిరిగిన శరీరంతో నడుముకు పులిచర్మం కట్టుకుని చేతిలో బాణం పట్టుకొని ఒక వేటగాడు నిలబడి ఉన్నాడు. మొత్తం నూట ఆరు మంది దగ్గరికి వచ్చేసరికి ఆ వేటగాడు వీరి పైకి బాణం ఎక్కు పెట్టాడు. అందరినీ వదిలేసి అర్జనుడి మీదికి బాణం గురి పెట్టాడు. ఆ వేటగాడు ఎవరో కాదు ఆ వేటగాడే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు అందరినీ వదిలేసి అర్జునుడి పైకే బాణం ఎక్కుపెట్టడానికి కారణం అర్జునుడు చేతిలో ఉన్న బాణం మరియు అర్జునుడు చూసే చూపుని బట్టి ఇతను విల్లుకారుడు, వీరందరిలోకెల్లా శక్తివంతుడు ఇతడే అని భావించి ఏకలవ్యుడు అర్జునుడి మీదకి బాణం ఎక్కుపెట్టాడు. నువ్వు ఎవరూ అని ధర్మరాజు ఏకలవ్యుడిని అడిగాడు.

దానికి ఏకలవ్యుడు ఏమి సమాధానం చెప్పాడో, తనవేలుని కోసుకోమని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ఎందుకు అడిగాడే, ఆ తర్వాత కర్ణుడు ఎలా ఎంటర్ అయ్యాడో తరువాతి పార్ట్ లో చెబుతాను...

 ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com

డియర్ ఫ్రెండ్స్ దయచేసి Subscribe మీద క్లిక్ చేసి Subscribe చేసుకోండి. మీరు Subscribe చేసుకుంటే నేను ఆర్టికల్ పోస్ట్ చేయగానే మీకు Notification వస్తుంది.